సరూర్నగర్ స్టేడియంలో తెలంగాణ రక్షణ సేన కార్యకర్తల సదస్సు
గజ్వేల్ నుండి ముఖ్య ప్రతినిధుల తరలింపు
గజ్వేల్/సిద్దిపేట జిల్లా: సామాజిక న్యాయం, బడుగులకు రాజకీయ ప్రాతినిధ్యం లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన ఈ నెల 6న సరూర్నగర్, ఇండోర్ స్టేడియంలో తలపెట్టిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు గజ్వేల్ నుండి 1000 మంది ముఖ్య కార్యకర్తలతో తరలి వెళ్తున్నట్లు హైకోర్టు న్యాయవాది, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జి కొట్టాల యాదగిరి ముదిరాజ్ తెలిపారు. మంగళవారం గజ్వేల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితో టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఆశించిన సామాజిక న్యాయం జరగలేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి వర్గానికి, వెనుక బడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిoచడం ఈ సదస్సు ఏర్పాటు లక్ష్యమని అన్నారు. సంకల్ప సభతో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ సామాజిక న్యాయo అమలు తదితర ప్రజల అభిప్రాయాన్ని పాలకుల దృష్టికి బలంగా తేనున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆకాంక్షించిన సామాజిక తెలంగాణ నిర్మాణమే సభ లక్ష్యమని, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించే దిశగా ఈ సభా వేదిక అడుగులు వేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఎడ్ల నర్సింలు, శ్రీకాంత్, స్వామి, అమర్ సింగ్, చందు, ప్రసాద్, కుమార్, వెంకటేష్ , అశోక్, రాజేష్, కిషన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
ఆగస్టు 6న జరిగే... సంకల్ప సభను విజయవంతం చేయండి
Quick Summary:
MURALI REPORTER