కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి,
సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 12 మన వార్త : మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఐఏఎస్ గురువారం కౌకూర్ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా భరత్నగర్ సమీపంలోని ఎస్సీ శ్మశానవాటికతో పాటు హరిప్రియా కాలనీలోని రోడ్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పరిశీలన అనంతరం కీసర డిప్యూటీ ఇంజనీర్ మాధవాచారి, వర్క్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్లకు సంబంధిత అభివృద్ధి పనుల కోసం తక్షణమే వర్క్ ఆర్డర్లు జారీ చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంత సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి లక్ష్మణ్ యాదవ్, తిరుపతి రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అధికారులతో సమన్వయం చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
Medchal -Malkajgiri District
కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్..
Quick Summary:
మన వార్త ప్రతినిధి :అంతోని